Serial Actors Divorce : కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందంటారు. ఆలుమగల సంబంధంలో మనస్పర్దలు వస్తూనే ఉంటాయి. పోతూనే ఉంటాయి. మనస్పర్దలు పెరిగితే ఇక అంతే సంగతి. దంపతుల మధ్య గొడవలు పొద్దున వచ్చి సాయంత్రం పోయేవిగా ఉండాలి. కానీ తీవ్ర స్థాయికి చేరితే ఇబ్బందులే. ఈ నేపథ్యంలో భార్యాభర్తలు చాలా మంది విడిపోవడానికే మొగ్గు చూపుతున్నారు.
తాజాగా బుల్లితెర నటుల్లో రుచిత మహాలక్ష్మి, దినేష్ గోపాల్ స్వామిని వివాహం చేసుకుంది. కొన్నాళ్ల పాటు సవ్యంగానే సాగిన వీరి సంసారంలో కలతలు మొదలయ్యాయి. దీంతో ఇద్దరు వేరుగా ఉంటున్నారు. వివాహ బంధంతో ఒక్కటైనా మనస్పర్దల కారణంగా విడిపోయారు. దీంతో వారి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఒక సందర్భంలో మా మధ్య విభేదాలు పోయాయని త్వరలో కలుసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
జూన్ 21న దినేష్ రుచితకు అశ్లీలకరమైన సందేశాలు పంపుతున్నాడని రుచిత పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. వాట్సాప్, ఫేస్ బుక్ లలో అభ్యంతరకరమైన సందేశాలు పంపుతున్నాడని ఫిర్యాదు చేసింది. దీనిపై దినేష్ మాట్లాడుతూ అనవసరంగా తనను రెచ్చగొడుతోందని వాపోయాడు. ఇక విడాకులు తీసుకోవడం గ్యారంటీ అని చెబుతున్నాడు.
ఇటీవల దినేష్ రుచిత క్లోజ్ ఫ్రెండ్, డబ్బింగ్ ఆర్టిస్టు గా రాణిస్తున్న ఓ యువతి దినేష్ పై గతంలో ఫిర్యాదు చేసింది. దీంతోనే రుచిత దినేష్ విడిపోయారు. అసత్య ప్రచారం వల్లే రుచిత తనపై ఆరోపణలు చేస్తుందని దినేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మొత్తానికి వీరి కాపురంలో కలతలు విడిపోయే వరకు వెళ్లాయని తెలుస్తోంది. ఇక వీరు విడాకులు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.