TV actress Rachita : పట్టుమని పది రోజులు కూడా కాపురాలు చేయడం లేదు సెలబ్రెటీ జంటలు. ఏదో కారణంతో గొడవపడడం సర్ధుకుపోకుండా విడిగా ఉండడం ఒకరిపై ఒకరు పగ తీర్చుకోవడం ఇదే జరుతోంది. బుల్లితెర నటి తన భర్త ప్రవర్తనపై మంగళవారం (జూన్ 20) పోలీసులను ఆశ్రయించిందట.
బుల్లితెర నటి రచిత మహాలక్ష్మి తన భర్త దినేశ్ కార్తీక్ పై చెన్నై మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా తనకు సెల్ ఫోన్ లో అసభ్య సందేశాలు పంపిస్తున్నాడని, పదే పదే మెసేజ్ లు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. మంగళవారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లిందని తెలుసుకున్న ఆమె భర్త కూడా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని, తనకు అంతగా ఇష్టం లేకపోతే కోర్టులో విడాకులు తీసుకోవచ్చని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
తమిళం లోని ‘పివరం సంతిప్పమ్’ సీరియల్ లో రుచిత మహాలక్ష్మి, దినేశ్ కార్తీక్ జంటగా నటించారు. బుల్లితెరపై హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న వీరు ప్రేమలో పడ్డారు. 2013లో వివాహం చేసుకున్నారు. కొంత కాలం క్రితం వీరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో విడిగా ఉంటున్నారు. దినేశ్ మాత్రం గొడవలు పక్కన పెట్టి కలిసి ఉందామని చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు.
అయితే, రచిత ఫ్రెండ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ జీజీ కూడా దినేశ్ పై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ప్రోత్బలంతోనే రచిత దినేశ్ ను విడిచిపెట్టిందని దినేశ్ ఇంటర్వ్యూలలో చెప్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది. నాపై లేనిపోని అభాండాలు వేస్తున్నాడని జీజీ పేర్కొంది. రచిత మహాలక్ష్మి తెలుగులో స్వాతి చినుకులు సీరియల్ లో నటించింది.