marriage : ఒక్కోసారి మనం ఎలాంటి దారుణమైన విషయాలు వినాల్సి వస్తుందో చెప్పడం కష్టమే.. తాజాగా జరిగిన ఈ ఘటన విన్నవారంతా షాక్ అవుతున్నారు.. విషయంలోకి వెళ్తే.. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.. అందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా.. మొత్తం వింటే వింత మీకే అర్ధం అవుతుంది.. ఈ మధ్య స్వలింగ సంపర్క వివాహం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
ఈ స్వలింగ సంపర్కుల వివాహానికి కూడా చట్టబద్ధత కల్పించే అంశం సుప్రీం కోర్టులో నడుస్తూ ఉండగానే స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ అవుతుంది.. పశ్చిమ బెంగాల్ లో ఇద్దరు స్వలింగ సంపర్కులు వివాహం చేసుకున్న న్యూస్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. వీరికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ లో ఇద్దరు స్వలింగ సంపర్కులు పబ్లిక్ గా గుడిలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వకముందే వీరు పెళ్లి చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకుని నూతన దంపతులుగా మారిపోయారు.. వారి పేర్లు మౌసుమి దత్తా ఇంకా మౌమిత.. వీరు సోషల్ మీడియా వేదికగా పరిచయం ఏర్పడడంతో చాలా కాలం పాటు డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తాజాగా పెళ్లి చేసుకున్నారు.
అయితే మౌసుమి దత్తాకు ముందే పెళ్లి అయ్యి భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉనాన్రు. తన భర్త రోజు చిత్రహింసలు పెడుతున్నాడని అందుకే ఆయన నుండి విడిపోయానని ఆమె తెలిపింది. మౌమిత మౌసుమి దత్తా పిల్లలను కూడా అంగీకరించడంతో వీరి పెళ్లి జరిగింది. మౌమిత ప్రేమ అనేది ఎవ్వరి మధ్య అయిన పుడుతుంది.. స్త్రీ పురుషుల మధ్య మాత్రమే కాదు అని సమాధానం చెబుతుంది.. మౌమిత ఇంట్లో వారు ఈ పెళ్లిని అంగీకరించక పోవడంతో వీరు వేరు కాపురం పెట్టారు. ఈ పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.