ఏపీ అభివృద్ధిలో భాగంగా భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ బుధవారం శంకుస్థాపన చేశారు. మూడేళ్ల లోపు ఈ ఎయిర్ పోర్టు పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు ఏపీ అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారుతుందన్న జగన్..ఇవాళ శంకుస్థాపనను జీర్ణించుకోలేని వారు ఉన్నారన్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఉత్తరాంధ్ర జాబ్ హబ్ గా మారబోతుందని అన్నారు. మెడికల్ టూరిజం, ఐటీ ఇండస్ట్రీ ఏపీకి కేంద్ర బిందువుగా మారాయి. 2026లో మీ బిడ్డ భోగాపురం ఎయిర్ పోర్టును ప్రారంభిస్తాడని జగన్ అన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరెన్ని కుట్రలు చేసినా పని చేయవని సీఎం అన్నారు.
ఈ శంకుస్తాపనని కొందరు జీర్ణించుకులేకపోతున్నారని..అలా
గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా చూడండి. ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం అని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందని భావిస్తేనే తనను ఆశీర్వదించండని అడుగుతామని అన్నారు. మేనిఫెస్టో అంటే టీడీపీ మాదిరిగా 600 పేజీల పుస్తకం నింపి..ఎన్నికల తర్వాత చెత్తబుట్టలోకి వెళ్ళేది కాదన్నారు. అధికారం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన వాళ్ల దగ్గరకు వెళ్లి కూడా మీకు మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందా అని అడగగలం. మంచి జరిగిందని భావిస్తేనే మళ్లీ ఆశీర్వదించండి. మంచి చేశాం కాబట్టి మీ ముందుకు వచ్చి ఇలా అడగగలం. అలాగే చంద్రబాబు ఇలా అడగగలడా? అని జగన్ ప్రశ్నించారు. చేసింది చెప్పడానికి చంద్రబాబు దగ్గర ఏమి లేదు. ఏ మంచి చేయని చంద్రబాబుకు దత్తపుత్రుడు ఎందుకు సహకరిస్తున్నాడు? చంద్రబాబు ముఠా దొంచుకో, పంచుకో, తినుకో అనే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. కానీ తాము ప్రజలను నమ్ముకున్నామని జగన్ పేర్కొన్నారు.