Uppal Stadium : కాసేపట్లో హైదరాబాద్, చెన్నై క్రికెట్ మ్యాచ్ జరగనున్న ఉప్పల్ స్టేడియం ఉద్రిక్తత నెలకొంది. టికెట్లు ఉన్న తమను లోపలికి అనుమతించడం లేదని కొందరు క్రికెట్ అభిమానులు ఆందోళనకు దిగారు.
గేట్ నెంబర్ 4 వద్ద ఉన్న భారీ కేట్లను దోచుకుం టూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
నేడు హైదరాబాద్ నగరంలో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే టికెట్లు విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. టికెట్లు లేవని చెప్పడంతో ఒకసారిగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.