Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కోర్టులో చుక్కెదురైంది. తాను అవినీతికి పాల్పడినట్లు రుజువైంది. దీంతో రూ.4 లక్షల డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఆయన గిలగిలలాడారు. కోర్టులో వ్యతిరేక తీర్పు రావడంతో డబ్బులు కట్టాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ట్రంప్ రాజకీయ భవితవ్యంపై దుమారం రేగుతోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మరోమారు తన లక్ ను పరీక్షించుకోనున్నారు. బైడెన్ తప్పుకోవడంతో ట్రంప్ పోటీలో నిలవడం గమనార్హం. పన్ను ఎగవేత గురించి ట్రంప్ పై 2018లో పులిట్టర్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. దానికి బహుమతి వచ్చింది. దీంతో దాని విలేకరులు ట్రంప్ మీద కోర్టులో కేసు వేశారు. విలేకరులు ట్రంప్ సోదరుడి కుమార్తె మేరీ ట్రంప్ నుంచి సమాచారం సేకరించారు.
ట్రంప్ సంపాదన పన్ను ఎగవేత ద్వారా తన తండ్రి నుంచి వచ్చిందనే అభిప్రాయానికి కోర్టు వచ్చింది. దీంతోనే ట్రంప్ కు జరిమానా కింద రూ. లక్షల డాలర్లు చెల్లించాలనే ఆదేశం వచ్చింది. తండ్రి కుమారులు పన్ను ఎగవేత ద్వారా సంపాదించిన సంపాదనతో ట్రంప్ కోటీశ్వరుడిగా మిగిలారని అభిప్రాయపడింది. న్యూయార్క్ టైమ్స్ పాత్రికేయులకు కుటుంబ రహస్యాలను మేరీ తెలియజేసింది.
దీని మీద 10 కోట్ల డాలర్ల నష్టపరిహారం కోరుతూ ట్రంప్ 2021లో కోర్టుకెళ్లారు. జడ్జి ఈ దావా నుంచి టైమ్స్ విలేకలరులను మినహాయించి కోర్టు ఖర్చుల కింద ట్రంప్ 4 లక్షల డాలర్లు అందజేయాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. కుటుంబ వ్యవహారాలు బయట పెట్టకూడదనే ముందే చేసుకున్న ఒప్పందాన్ని మేరీ ఉల్లంఘించారనే ఆరోపణల మీద విచారణ ఇంకా కొనసాగుతోంది.