Bride Room Real Twist : ఇటీవల కాలంలో మోసాలు పెరుగుతున్నాయి. పెళ్లి విషయంలో చాలా మంది నిజాలు దాచిపెట్టి పెళ్లిళ్లు చేస్తున్నారు. తీరా విషయం తెలిశాక బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారు. దీంతో చేసేది లేక కాంప్రమైజ్ అయిపోతున్నారు. తాజాగా జరిగిన ఓ సంఘటన దీనికి తార్కాణంగా నిలుస్తోంది. మాయమాటలకు మోసపోయి తరువాత తల పట్టుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది.
ఉత్తరప్రదేశ్ లో ని మొరాదాబాద్ లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు సంతోషంగా వివాహం చేసుకుని మొదటి రాత్రి జరుపుకునేందుకు గదిలోకి వెళ్లాడు. అక్కడ తన భార్యను చూసి నిర్ఘాంతపోయాడు తన భార్య స్త్రీ కాదని ట్రాన్స్ జెండర్ అని తేలడంతో ఆశ్చర్యపోయాడు. భార్య, అత్తమామలను నిలదీశాడు. వారు కూడా బ్లాక్ మెయిల్ కు దిగడంతో వారికి లొంగిపోయాడు.
నాలుగేళ్లు ఓపిక పడితే తన కూతురు పూర్తిస్థాయిలో అమ్మాయిగా మారుతుందని నమ్మబలికారు. దీంతో అతడు నాలుగేళ్లు చూసినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. కోర్టుకెక్కాడు. వారిపై కేసు పెట్టాడు అత్తగారు చేసిన మోసంపై పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఠాకూర్ కొత్వాలి ప్రాంతానికి చెందినది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దేశంలో వింత మోసాలు జరుగుతున్నాయి. గతంలో పెళ్లి పేరుతో మోసపోయిన ఘటనలు ఎన్నో జరుగుతున్నా మేల్కోవడం లేదు. పెళ్లి తంతుతో పలువురు మోసపోతూనే ఉన్నారు. ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకుని ఇరుకున పడిపోయాడు. పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లు వారి బెదిరింపులకు లొంగిపోయి వారి అడిగిన డబ్బు ఇచ్చేశాడు.