Junior NTR :
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చరిత్ర లిఖించారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారు. రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పారు. కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడిన వ్యక్తిగా ఖ్యాతి గడించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ కూడా కొన్నాళ్లుగా నానుతోంది. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కావడం లేదు.
ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన పేరు మీద వంద రూపాయల నాణెం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఆహ్వానించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో జరిగే వేడుకకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు 200 మంది అభిమానులను ఆహ్వానించారు. అందరు కూడా వస్తున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రావడం లేదు. దీంతో అతడి గైర్హాజరుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అందుకే తాను రాలేనని చెబుతున్నాడు. కానీ అందులో వాస్తవం లేదని జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడానికి ఇతర కారణాలేవైనా ఉండొచ్చని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీపార్వతికి మాత్రం ఆహ్వానం అందలేదు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం వచ్చారు. దీని వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం పాల్గొన్నారు. ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి తారక్ హాజరు కాకపోవడంపై సినిమా షూటింగే కారణమా? ఇంకా ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అనే కోణంలో ఆలోచనలు వస్తున్నాయి. 2009లో టీడీపీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. కానీ ఆయనకు సరైన విలువ ఇవ్వకపోవడంతో 2014లో దూరంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఏదో ఉద్దేశంతోనే ఎన్టీఆర్ కార్యక్రమానికి రాకుండా ఉన్నట్లు తెలుస్తోంది.
ReplyForward
|