Soyam bapurao : భారతీయ జనతా పార్టీ 2018 ఎంపీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు సోయం బాపూరావు. ఆయనకు అక్కడ చాలా ఇమేజ్ ఉంది. బీజేపీ నుంచి గెలిచిన వారిలో ఆయన ఒకరు. పార్టీ పరువును తెలంగాణ కాపాడాడంటూ అప్పట్లో ఆయనను బీజేపీ నాయకులు కీర్తించారు. కేసీఆర్ కూడా సోయం ఏం చేస్తాడు అంటూ కామెంట్లు చేశాడు. అయితే ఈ మధ్య ఆయనపై జోరుగా వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి.
కర్ణాటక ఫలితాల నేపథ్యంలో బీజేపీలోని చాలా మంది నేతలు పార్టీ మారుతున్నారని. అందులో ఎంపీ సోయం బాపూరావు కూడా ఉన్నాడని ప్రచారం అవుతుంది. దక్షిణాదిన బీజేపీ ఎటువంటి గెలుపు సాధించలేదని అందుకు కర్ణాటకనే సాక్ష్యం అంటూ కొందరు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల ప్రచారం వల్ల పెద్ద ఎత్తున బీజేపీ నుంచి నాయకులు బయటకు వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను కొందరు ఖండిస్తుండగా మరికొందరు సమర్ధిస్తున్నారు. ఇక బీజేపీలో కొనసాగబోమని దక్షిణాదిన పూర్తిగా పట్టు కోల్పోతుందని కొందరు ఆరోపిస్తున్నారు.
అయితే ఇటీవల సోయం బాపురావుపై వస్తున్న ట్రోలింగ్ ను ఆయన ఖండించారు. బీజేపీ అంటే నాకు పార్టీ కాదని, ఒక ఇల్లని అన్నారు ఆయన. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు ఇక్కడికి వస్తారని, నేను బయటకు వెళ్లడం అనేది జరగదన్నారు. ఈ పుకార్లు ఎలా పుట్టాయో తెలియదు కానీ, ఇవన్నీ అబద్ధమే అన్నారు. కర్ణాటకలోని పరిస్థితులు తెలంగాణ పరిస్థితుల కంటే పూర్తి భిన్నమైనవి. అక్కడ కాంగ్రెస్ వస్తుందని ముందే తెలిసింది. అయినా పోరాటం ఆపలే కదా.. అందుకే పోరాటం చేశాం. కానీ ఓటమి పాలైంది.
కర్ణాటకలో జరిగింది తెలంగాణలో జరగదు. అక్కడ ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది. ఇక్కడ అలాకాదు.. చివరి వరకూ సస్పెన్స్ ఉంటుంది. కానీ ఈ సారి బీఆర్ఎస్ మాత్రం ఓటమి పాలవుతుంది. బీజేపీ పుంజుకుంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక కాంగ్రెస్ ఒక్క రాష్ట్రం గెలిచినంత మాత్రాన మేము దేశంలో లేమని కాదుకదా.. అన్నారు. ఏది ఏమైనా తాను పార్టీని వీడేది లేదన్నారు.