Nara Lokesh : యువగళం పాదయాత్రలో ఆర్ఎం పీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూశానని, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి వందరోజుల్లోనే వారి సమస్యలు పరిష్కరిస్తామని యువనేత నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో ఆర్ఎంపీలు, మెడికల్ షాప్స్ అసోసి యేషన్ ప్రతినిధులతో యువనేత ముఖాముఖి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మొదటి వందరోజుల్లోనే ఆర్ఎంపీలు ఎదుర్కొంటున్న సమ స్యలను పరిష్కరిస్తాం. ఆర్ఎంపీలకు మె రుగైన శిక్షణ, గుర్తింపు కోసం గత టీడీపీ ప్రభుత్వం జీవో నెం.429 విడుదల చేస్తే వైసీపీ వచ్చిన తర్వాత నిలిపివేశారు. జీవోను పునరుద్దరించడంతో పాటు మెడికల్ అసోసియేషన్ తో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మెడికల్ షాపు లపై వేధింపులకు అడ్డుకట్టవేస్తాం అన్నారు.
పన్నుల భారం తగ్గిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఆర్ఎంపీలు, మెడికల్ దుకాణదారులు ఎదుర్కొం టున్న సమస్యలను ఈ సందర్భంగా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ వైద్య, ఆరోగ్య కార్యక్ర మాల్లో ఆర్ఎంపీలను భాగస్వాములను చేయా లని కోరారు. ఆర్ఎంపీలపై పోలీసుల వేధింపులను ఆపాలి.
టీడీపీ ప్రభుత్వంలో జీవో 429 ద్వారా ఆర్ఎంపీల కు సాయం చేస్తే జగన్ ఆ జిఓ రద్దుచేసి ఇబ్బం దులకు గురిచేస్తున్నారు. 429 జీవోను పునరుద్ద రించాలి. మెడికల్ దుకాణాలపై పన్నులభారం తగ్గించాలి, మెడికల్ షాప్స్ అసోసియేషన్ కు భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
మెరుగైన ఇసుక పాలసీ తెస్తాం..
అధికారంలోకి వచ్చాక మెరుగైన ఇసుక పాలసీతో ఇసుక అందుబాటులోకి తెస్తాం, అమరావతి పను లు కొనసాగించి అందరికీ చేతినిండా పనికల్పిస్తాం, భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని యువనేత నారా లోకేష్ చెప్పారు. ఉండవల్లి నివాసంలో భవన నిర్మాణ కార్మికులతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ పాలనలో ట్రాక్టర్ ఇసుక రూ.1500 ఉంటే నేడు రూ.5వేల నుంచి రూ.7వేలకు పెరిగింది. రాష్ట్రంలో మొట్టమొదట ఆత్మహత్యలు ప్రారంభమైంది భవన నిర్మాణ కార్మికులతోనే. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి పురోహితుల వరకు ఇబ్బందులు పడుతున్నారు.