Venkatesh : మన స్టార్ హీరోల తీరే సపరేట్ గా ఉంటుంది. వారి కోసం అన్ని ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. లేకపోతే ఆ ప్రోగ్రామే చేయరు. ఎక్కడకెళ్లినా తమ దర్జా, దర్పం ఉండాలని అనుకుంటారు. అలా ఉండకపోతే అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇది సాధారణంగా చూస్తుంటాం. విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి అలా ప్రవర్తిస్తుంటారు. కానీ సాధారణంగా ఉంటేనే వారిని ఎక్కువ మంది ఇష్టపడతారనే విషయం వారికి తెలియదు. అందుకే ప్రతి విషయంలో తమ ఉనికి ఉండేలా ప్రయత్నిస్తుంటారు. తాము ప్రత్యేకమని మురిసిపోతుంటారు.
తెలుగు హీరోల్లో మంచి పేరు సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ ది కూడా ప్రత్యేక శైలి. విలాసాలకు భిన్నంగా వ్యవహరిస్తుంటాడు. తాను గొప్ప అనే ఫీలింగ్ ఉండదు. సాధారణ ప్రేక్షకుడి వలే ఫీలవుతారు. తన కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉండాల్సిన అవసరం లేదని భావిస్తారు. సింప్లిసిటీ అంటే తనకు ఇష్టమని తన ప్రవర్తన ద్వారా ఇతరులకు సూచిస్తుంటాడు.
వెంకటేష్ సంక్రాంతికి సైంధవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. సినిమా రిలీజ్ కోసం టీజర్, ట్రైలర్, ఈవెంట్లలో ప్రత్యేకంగా పాల్గొంటున్నాడు. ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా తన ప్రాతినిధ్యం ఉంటోంది. ఈ సందర్భంలో మీడియా మీట్స్, ప్రెస్ కాన్ఫరెన్స్ లలో పాల్గొనే స్టార్ హీరోలు వారి కోసం ప్రత్యేకంగా కుర్చీలు ఉండేలా చూసుకుంటారు.
వెంకీ మామ మాత్రం దానికి విరుద్ధం. ఓ ప్రమోషన్స్ కోసం వెళ్లినప్పుడు వెంకీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీని తీసేయమని చెప్పాడు. తన కోసం ప్రత్యేకంగా కుర్చీ వేయాల్సిన అవసరం లేదని సూచించాడు. తానేమీ స్పెషల్ కాదని మీలో ఒకడినే అని నిర్మొహమాటంగా చెప్పడం విశేషం. ఇలాంటి విషయాల్లో కూడా వెంకీ సింప్లిసిటీని చూసిన మీడియా వాళ్లు అవాక్కయ్యారు. వెంకటేశ్ సాధారణకు ఫిదా అయ్యారు. వెంకీ నిజంగా హీరో అని అనుకున్నారు.