డ్రై ఫ్రూట్స్ మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మనకు నీరసం రాకుండా ఉండాలంటే వీటితో తయారు చేసుకునే లడ్డు మనకు బాగా ఉపయోగపడుతుంది. అదెలా తయారు చేసుకోవాలంటే ఒక మిక్సీ జార్ లో ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కప్పు ఎండు ఖర్జూరం వేసి పొడి చేసుకోవాలి. అనంతరం బాదం, పిస్తా, జీడి పప్పు వేసుకుని పొడి చేసుకోవాలి.
పొయ్యి మీద పాన్ పెట్టి ఈ పొడులను మూడు నుంచి నాలుగు నిమిషాలు డ్రైగా వేయించుకోవాలి. వేయించిన పొడులను ఒక బౌల్ లోకి తీసుకోవాలి. అదే పాన్ లో మరో పావు కప్పు గోధుమ పిండిని వేయించాలి. అరకప్పు నెయ్యి వేసి ఆ పొడులను వేయించాలి. అదే పాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి అందులో బెల్లం వేసి కరిగాక ఈ పొడులు వేసి వేయించుకుని నెయ్యి కలిపి లడ్డూలుగా చేసుకోవాలి.
ఈ లడ్డులను ప్రతి రోజు ఒకటి చొప్పున తినాలి. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు వీటిని తీసుకోవచ్చు. దీని వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. అలసట, ఆందోళన రాకుండా ఉంటాయి. ఎంతో బలవర్ధకమైన ఆహారంగా దీన్ని తీసుకోవడం వల్ల మన శారీరక బలం పెరుగుతుంది.