తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది TSPSC. గ్రూప్ -1 తో పాటుగా ఏఈఈ , డీఏఓ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈరోజు ఉదయం కమీషన్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కాగా సిట్ ఇచ్చిన ప్రాధమిక నివేదిక ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకుంది కమీషన్. రద్దు చేసిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష ను జూన్ 11 న నిర్వహించనున్నట్లు కమీషన్ వెల్లడించింది.
ఇదే కాకుండా జూనియర్ లెక్చరర్స్ పరీక్షలతో పాటుగా మరికొన్ని పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది TSPSC. రద్దు చేసిన పరీక్షల కొత్త తేదీలను వీలైనంత త్వరగా వెల్లడిస్తామని స్పష్టం చేసింది. పేపర్ లీకేజ్ స్కామ్ లో పట్టుబడిన ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో మరిన్ని పేపర్లు ఉండటమే ఈ నిర్ణయాలకు కారణం.