Alluarjun and JR Ntr : తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో గొప్ప కధానాయకులు చాలా మంది ఉన్నారు. వీరిలో ‘అల్లు అర్జున్’, ‘జూనియర్ ఎన్టీఆర్’ గురించి చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ ఇద్దరు యువ హీరోలు ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫాం లో చేరి సోషల్ మీడియా ప్లాట్ ఫాం లో చేరిన తొలి టాలీవుడ్ నటులుగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’: ది రూల్ సినిమాలతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక గా ‘ఫేస్ బుక్’, ‘ఇన్స్టాగ్రామ్’, ‘ట్విట్టర్’ ఇలా ఎన్నో ప్లాట్ ఫాం లు మనకు అందుబాటు లో ఉన్నాయి. ఇందులో ‘ట్విట్టర్’ అనేక మంది ఖాతాదారులను కలిగి ఉండి ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ‘ట్విట్టర్’ కు పోటీగా ఇన్స్టాగ్రామ్ అభివృద్ధి చేసిన తాజా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘థ్రెడ్స్’ . ఈ కొత్త ప్లాట్ఫామ్ ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉంది. ఇప్పటికే 2 మిలియన్లకు పైగా ప్రజలు ఈ కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను డౌన్లోడ్ చేసుకుని ఇందులో చేరారు.అల్లు అర్జున్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఈ కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను స్వీకరించిన మొదటి తెలుగు నటులు గా నిలిచారు. అయితే, వారు ఇంకా ఏమీ పోస్ట్ చేయలేదు.
అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో సినిమాలు చేస్తుండగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల షూటింగ్ పూర్తి కాగానే ఈ ప్రాజెక్టుల చిత్రీకరణను ప్రారంభించనున్నారు.