Guntur Karam Movie : మహేశ్ బాబు త్రివిక్రమ్ కలయికలో సినిమా రూపుదిద్దుకుంటోంది. గుంటూరు కారం పేరుతో సినిమా నిర్మానం జరుగుతున్నా వేగం పుంజుకోవడం లేదు. ఇదివరకు ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న సినిమా వేగంగా షూటింగ్ సాగడం లేదు. త్రివిక్రమ్ సినిమా నిర్మాణంలో వేగం చూపుతాడు. కానీ ఎందుకో ఈ సినిమా షూటింగ్ మెల్లగా సాగుతోంది. రెండు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అనే తీరుగా నడుస్తోంది.
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తరువాత వచ్చిన ఖలేజా నిరుత్సాహపరచినా ఈ సినిమాతో ఆ లోటు పూడ్చాలని చూస్తున్నారు. మూడో సినిమాగా వస్తునన గుంటూరు కారం కృష్ణ జయంతి సందర్భంగా టీజర్ విడుదల చేశారు. దీంతో నిర్మాణంలో వేగం పెరుగుతుందని అనుకున్నారు.
మొదట జూన్ 7 తరువాత 12 పిదప 20 అన్నారు. ఇప్పుడు జులైకి మార్చారు. ఇలా సినిమా షూటింగ్ వాయిదాలు వేస్తుంటే అనుకున్న సమయానికి విడుదల కుదురుతుందో లేదో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో జనవరి 13న సంక్రాంతికి విడుదల చేయాలని ప్రకటించినా అది కుదురుతుందో లేదో తెలియడం లేదు. వాయిదాలు చూస్తుంటే సరైన సమయానికి విడుదల సాధ్యం కాకపోవచ్చు.
మహేశ్ బాబు రెడీగా ఉన్నా కీలక నటుల డేట్స్ దొరకడం లేదని సమాచారం. అందుకే షూటింగ్ వరుసగా వాయిదా పడుతుందంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం కుదరదేమో అనే సందేహాలు వస్తున్నాయి. దీనిపై మహేశ్, త్రివిక్రమ్ ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు.
ReplyForward
|