తెలుగు తెరపై ఒక్కడు, అర్జున్, వంటి కమర్షియల్ భారీ చిత్రాలే కాదు.. మన చరిత్ర.. పురాణాల ఆధారంగా సినిమాలు తీసిన దర్శకుడు దర్శకుడు గుణశేఖర్. అందుకు రుద్రమదేవీ, శాకుంతలం చిత్రాలు నిదర్శనం. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారితో వర్క్ చేసిన డైరెక్టర్ రీసెంట్ గా హీరోలపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఈ నెల 14న గుణశేఖర్ డైరెక్టర్ చేసిన ‘శాకుంతలం’ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో భాగంగా ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా… దుష్యంతుడి పాత్ర కు తెలుగు హీరోలు కాకుండా మలయాళం నటుడిని తీసుకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న దానిపై క్లారిటీ ఇచ్చాడు. తెలుగుహీరోలు నెగటివ్ షేడున్న పాత్రలు చేస్తున్నారు. అది కూడా ఆ కథలు హీరో ప్రధానంగా సాగితేనే.. దుష్యంతుడి పాత్రలో కొన్ని వ్యతిరేక ఛాయలున్నాయి. దీంతో అడిగి లేదనిపించుకోవడం ఇష్టం లేక ఎవరినీ అడిగే ప్రయత్నం చేయలేదని… అందుకే దేవ్ మోహన్ను తీసుకున్నట్లు తెలిపాడు. అంతేకాక కొన్ని పాత్రలు చేసే విషయంలో హీరోల తీరు మారాలని హితవు పలికారు.
ఇప్పటి వరకు శకుంతలని ఎక్కువగా శృంగార కోణంలోనే చూపారు. కానీ ఆత్మాభిమానం కోసం రాజులు, రాజ్యాలను లెక్కచేయని యువతి శకుంతల. పెండ్లి కాకుండా తల్లి కావడం అనేది అప్పట్లో పెద్ద నేరం. అలాంటి పరిస్థితులను ఆమె ఎలా ఎదురొడ్డి నిలబడింది అనేది ఈ చిత్ర కథాంశం. మహాహారతంలోని ఆదిపర్వంలోని శంకుతల కథకి తనదైన శైలిలో కొన్ని పాత్రల్ని జోడించి అభిజ్ఞాన శాకుంతలం రాశారు కాళిదాసు. ఆ కథను ఆధారంగా తీసుకుని తీసిన ఈ సినిమా నేటితరం అమ్మాయిలకు బాగా కనెక్ట్ అవుతుందన్న నమ్మకం ఉందన్నాడు గుణశేఖర్. సమంత తో పాటు దేవ్ మోహన్, మోహన్ బాబు సినిమాలో జీవించేశారని గుర్తు చేశాడు. ఇక ఈ మూవీ త్రీడీ ఫార్మేట్లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 14న విడుదల కానుంది.