బ్రేకింగ్ న్యూస్ ….. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీ కి బయలుదేరిన విమానం కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్లు గుర్తించారు. దాంతో వెంటనే గన్నవరం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ముఖ్యమంత్రి జగన్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని తెలియడంతో వైరల్ అయ్యింది. రేపు ఢిల్లీ లో జరిగే సమావేశంలో పాల్గొనడానికి బయలుదేరే సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో వైసీపీ శ్రేణులు షాక్ కు గురయ్యారు.