రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. పరువు నష్టం దావా కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధించింది గుజరాత్ లోని సూరత్ కోర్టు. ఆ షాక్ నుండి ఇంకా తేరుకోకముందే లోక్ సభ సెక్రటరీ మరింత షాక్ ఇచ్చాడు. రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన నేపథ్యంలో లోక్ సభ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లుగా ప్రకటన విడుదల చేశారు. దాంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 2019 లో లోక్ సభ ఎన్నికల సమయంలో దొంగల ముఠా పేర్లన్నీ మోడీ ఇంటి పేరు తోనే ఉన్నాయని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు రాహుల్ గాంధీ. దాంతో గుజరాత్ బీజేపీ నాయకులు సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అప్పుడు వేసిన పిటీషన్ పై నిన్న సూరత్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.