అయితే ఇంటర్ చదువుతున్న కొంత మంది విద్యార్థులను వారి తల్లిదండ్రలు సరిగా మానిటరింగ్ చేయకపోవడమో..లేక వారిని పట్టించుకోకపోవడం వల్లనో చాలాసార్లు అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్ రిజర్ట్స్ వచ్చినప్పుడు పిల్లలకు తల్లిదండ్రులు భరోసాను ఇవ్వడం లేదు. ఇంటర్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్కు ధైర్యం చెప్పడం లేదు.
దీంతో పలువురు విద్యార్థులు ఇంటర్ ఫెయిల్ అయిన సందర్భంగా తనువు చాలిస్తున్నారు. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధారణంగా చాలా మంది ఇంటర్ స్టూడెంట్స్ ఈసారి పరీక్షలు తప్పారు. అయితే వీరిలో తల్లిదండ్రుల సపోర్ట్ లేకనో సోసైటీలో అవమానం జరుగుతుందన్న కారణంగానో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 9 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్డడ్డారు.
చిత్తూరు జిల్లా ఏటవాకిలికి చెందిన అనుష..బైరెడ్డిపల్లెకు చెందిన బాబు,అనకాపల్లికి చెందిన తులసీ ఇలాగే ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక వైజాక్ కు చెందిన అఖిలశ్రీ, శ్రీనివాసనగర్కు చెందిన జగదీష్,అనంతపురం జిల్లా హనకనహాళ్ చెందిన మహేష్ ఎగ్జామ్స్ తప్పిన నేపథ్యంలో తమ విలువైన ప్రాణాలు తీసుకున్నారు.