ప్రతి వ్యక్తి తన జీవితంలో క్రమశిక్షణ లేకపోతే విజయాలు సాధించడం కష్టం. ఏదైనా మనకు దక్కాలంటే దానికి క్రమశిక్షణతోనే సాధ్యం. అది లేని వాడు జీవితంలో ముందుకు వెళ్లలేడు. ఎంతటి పని అయినా క్రమశిక్షణతోనే సాధించొచ్చు. ఈ విషయం తెలుసుకుని మసలుకుంటే మనుగడ సాద్యమే. దీనికి అందరు క్రమశిక్షణపై చొరవ తీసుకోవాలి.
తిండి విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. తిండి తినే సమయంలో సిగ్గు పడకూడదు. కడుపు మాడ్చకుంటే మనకే నష్టం. అందుకే తినేటప్పుడు సిగ్గుపడితే మన కడుపు నిండదు. మన కడుపు నిండే వరకు తినాలి. కావాలని అడిగితే తప్పు లేదు. ఆహారం తినేందుకు వెనకాడితే మనకే ఇబ్బందులు వస్తాయి. ఆకలిని చంపుకుంటే మనకే నష్టం.
గురువు దగ్గర కూడా సిగ్గు పడితే చదువు రాదు. ఏదైనా అనుమానం ఉంటే కచ్చితంగా అడిగి సమాధానం రాబట్టుకోవాలి. అంతేకాని సిగ్గు పడితే మనకు తెలివి రాదు. తెలివి విషయంలో కూడా సిగ్గు నికి రాదు. బిడియం ఉంటే ఏది కూడా మనకు తెలియదు. ఏ విషయం అయినా సమాధానం రాబట్టుకుంటేనే అనుమానం తీరుతుంది. దీంతో విద్యలో ముందుంటాం.