Pavan Kalyan to AP : జనసేన పార్టీ అధినేత చాలా రోజుల తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టబోతున్నాడు. మార్చిలో జనసేన ఆవిర్భావ సభ ఉండడంతో.. కృష్ణా జిల్లా, మచిలీపట్నంలోని ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన పార్టీ కార్యకర్తలు, జన సంద్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు ఆయన. ఇక ఆ తర్వాత ఆయన ఏపీకి రాలేదు.
గోదావరి ఉమ్మడి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం పర్యటించనున్నారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు. రైతులను ఆదుకోవడంలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా విఫలమైందని, సీఎంకు అన్నదాల కష్టాలు కనిపించడం లేదని ఆరోపించారు. పంట నష్టం తెలుసుకునేందుకు, ప్రభుత్వంతో కొట్లాడేందుకు ఆయన నేరుగా రైతులను కలుసుకోనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి విమానాశ్రయానికి వస్తారు. రోడ్డు మార్గంలో కడియంకు వెళ్తారు. పంట నష్టపోయిన బాధిత రైతులను పవన్ పరామర్శించనున్నారు. తర్వాత కొత్తపేట మండలం, ఆవిడి గ్రామలో రైతులతో ముఖాముఖి సమావేశమవుతారు. వారి కష్టాన్ని తెలుసుకుంటారు.
కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటన ఇప్పటికే ఖరారైంది. ఆయా నియోజకవర్గాల మీదుగా కొనసాగుతుంది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి గోదావరి జిల్లాల నాయకులు ఆయన వెంట ఉంటారు. గతంలో ఇదే ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే భారీ ఎత్తున కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు పవన్ కళ్యాణ్. సూసైడ్ చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని యాత్రను చేపట్టింది. సూసైడ్ చేసుకున్న రైతులకు సంబంధించి 40 కుటుంబాలకు ఆయన రూ. లక్ష చొప్పున చెక్కులను అందించారు.
మరోసారి ఆయన రైతు సమస్యలపైనే పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటించారు. పంట నష్టంపై విచారం వ్యక్తం చేశారు. జనసేన కూడా ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని ఎంచుకుంది. అందుకే పార్టీ అధినేత సుధీర్ఘ విరామం తర్వాత రానున్నారు.