32.8 C
India
Thursday, May 9, 2024
More

    Stolen property : చోరీ చేసి తొమ్మిదేళ్లకు తిరిగి ఇచ్చిన సొత్తు.. ఆశ్చర్యపోయిన ఆలయ సిబ్బంది..

    Date:

    stolen property
    stolen property

    Stolen property : ఎంత కసాయి వాడిలోనైనా ఎప్పుడో ఒకప్పుడు మార్పు రావడం ఖాయం. ఇది వృద్ధాప్యమా లేక యవ్వనమా.. అనేది అంటుంచితే.. ఇక్కడ ఒక దొంగలో కూడా మార్పు వచ్చింది. ఎంతలా అంటే కొన్నేళ్ల క్రితం ఆలయంలో చోరీ చేసిన నగలను తిరిగి ఆలయంలో పెట్టేశాడు. వీటితోపాటు లెటర్ కూడా పెట్టాడు. ఆ లెటర్ చదివిన ఆలయ సిబ్బంది షాక్ కు గురయ్యారు. ఇన్నేళ్లకు స్వామి వారి నగలు తిరిగి రావడంతో ఆనందించాలా లేక ఆశ్చర్యపోవాలో తెలియక సతమతం అయ్యారు.

    ఒడిసాలోని భువనేశ్వర్ లో 2014లో రాధాకృష్ణ ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. ఇందులో పెద్ద మొత్తంలో ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఇది అప్పట్లో భువనేశ్వర్ తీవ్ర చర్చకు దారి తీసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని కొన్నేళ్లు వెతికారు.. అయినా పోయిన నగదు గానీ, నిందితుడిని గానీ కనుక్కోలేకపోయారు. ఆ దొండ కూడా ఒక్క ఆనవాలు లేకుండా చాక చక్యంగా నగలు ఎత్తుకెళ్లాడు. ఎలాంటి క్లూ కూడా పోలీసులకు వదిలి వెళ్లలేదు. కొన్నేళ్లు వెతికిన పోలీసులు ఎట్టకేలకు కేసును మూసి వేశారు.

    ఇదే ఆలయం పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. అయితే ఆలయంలో 2014లో చోరీకి గురైన నగలు ప్రత్యక్షమయ్యాయి. ఇదంతా దేవుడి లీల అనుకుంటుండగా.. ఒక లెటర్ కనిపించింది. ఈ నగలను తానే చోరీ చేశానని.. అయితే ఇటీవల భగవత్ గీత చదివితే తనలో మార్పు వచ్చిందని, అందుకే నగలును ఆలయానికి తిరిగి ఇచ్చానని దొంగ లెటర్ లో పేర్కొన్నాడు. దీంతో అందరూ ఆశ్చర్య పోయారు. దాదాపు 9 సంవత్సరాలు ఆభరణానలు అమ్మకుండా, తాకట్టు పెట్టకుండా కాపాడి తిరిగి ఆలయానికి ఇవ్వడం, దొంగలో మార్పుపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related