28.5 C
India
Friday, May 3, 2024
More

    CM Jagan for investigation : విచారణకు సీఎం జగన్.. సీబీఐ నుంచి పిలుపు ఖాయమా?

    Date:

    CM Jagan for investigation
    CM Jagan for investigation

    CM Jagan for investigation :  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ వేగం పెంచింది. ఇప్పటికే ఈ కేసులో అసలు దోషులెవరనే విషయంలో సీబీఐ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తున్నది. అయితే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అంశంలో సీబీఐకి కొంత ఎదురుదెబ్బ తగులుతున్నది. ఆయనను విచారణకు రావాలని గత మూడు సార్లు ఆయనను పిలిచినా, వివిధ కారణాలు చెబుతూ తప్పించుకుంటూ వస్తున్నారు. అయితే ఇటీవల అవినాష్ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తీర్పును ఈనెల 31కి వాయిదా వేసింది. అయితే ఈ వాదనల్లో కీలక విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఏపీ సీఎం జగన్ పేరును కూడా తెరపైకి తెచ్చింది.

    అయితే వైఎస్ వివేకా హత్యకు సంబంధించిన కీలక విషయాన్ని అవినాష్ రెడ్డి జగన్ కు చెప్పినట్లుగా సీబీఐ అనుమానిస్తున్నది. వాట్సాప్ కాల్ ద్వారా ఇదంతా తెలియజేసినట్లుగా భావిస్తున్నది. ఇప్పటికే ఈ విషయమై వైఎస్ భారతి పీఏతో పాటు పలువురిని సీబీఐ విచారించింది. ఈ విషయం జగన్ కు తెలిసినా ఎందుకు బయటకు చెప్పలేదనే కోణంలో కూడా సీబీఐ విచారణ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అవినాష్ రెడ్డి వెనుక ఉన్న ఓబలమైన శక్తి తమ  విచారణకు అడ్డుపడుతున్నదని సీబీఐ పదే పదే చెబుతున్నది. అయితే ఈ విషయంలో  ఆ బలమైన శక్తి జగనే అన్నట్లుగా ప్రత్యర్థి వర్గాల నుంచి ఆరోపణలు చేస్తున్నాయి.

    మరోవైపు తన అన్నపై నమ్మకం లేకే వైఎస్ సునీత తెలంగాణ హైకోర్టులో కేసు విచారణ జరగాలని కోరిన విషయం అందరికీ తెలిసిందే.  అయితే సీబీఐ తాజాగా ఈ కేసులో రహస్య సాక్షి ఉన్నట్లు చెప్పింది. ఆ సాక్షికి ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇప్పుడే పేరు చెప్పలేమని, న్యాయస్థానానికి మాత్రం తన వాంగ్మూలాన్ని సీల్డ్ కవర్ లో అందజేస్తామని చెప్పింది.   అయితే జగన్ అధికారంలో ఉన్నాడు కాబట్టి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సీబీఐ పరోక్షంగా ఇప్పటికే న్యాయస్థానానికి చెప్పింది. మరి ఈ కేసులో అవినాష్ రెడ్డి తరువాత విచారణకు జగన్, భారతిలను సీబీఐ పిలిచే అవకాశమున్నట్లు సమాచారం.

    అయితే జూన్ 30 లోగా కేసును తేల్చాలని సుప్రీం కోర్టు ఆదేశించడం, ఇన్ని ఒత్తి్ళ్లు, రాష్ర్ట పోలీసులు సహకరించకపోవడం, తదితర ఇబ్బందులను దాటి సీబీఐ మరి కేసును తేలుస్తుందా.. మరికొంత కాలం సమయం కావాలని కోర్టును వ్యవధి కోరుతుందా.. వేచి చూడాలి

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...

    AP Liquor : ఓటేసే ముందు వైన్స్ షాపులను చూసి వెళ్లండి..

    AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల ముందు జగన్...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Viral Video : ‘‘రెండో సారి సీఎం కావాలంటే మూడో శవం కావాలే..’’ ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..

    Viral Video : ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతల ప్రసంగాలు ఘాటెక్కుతున్నాయి....