lose weight : ఈ రోజుల్లో బరువు పెరగడం సాధారణమైనదే. ఎవరు చూసినా బొద్దుగా ఉంటున్నారు. మనిషికి మందమే అందమంటారు. కానీ మందం అతిగా ఉండకూడదు. స్థూలకాయంగా ఉంటే రోగాలు దరి చేరడం ఖాయం. మనం తినే ఆహారాలే మనం మందమయ్యేలా చేస్తున్నాయి. రోజు తినే ఆహారాల్లో మార్పులు ఉండటం లేదు. అందుకే బరువు విపరీతంగా పెరుగుతున్నాం. ఫలితంగా సమస్యల బారిన పడతున్నాం.
అయితే ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే అధిక బరువు దరిచేరదు. అలాంటి వాటికి దూరంగా ఉంచి లాభంచేకూర్చే వాటిని తీసుకోవడం ఉత్తమం. మనకు బరువు నియంత్రణలో ఉంచే వాటిలో ఫూల్ మఖానా గింజలు ముఖ్యమైనవి. వీటితో మనం ఏ రకమైన పదార్థాలు తయారు చేసుకున్నా ఎంతో లాభం కలుగుతుంది. తరువాత రాగులతో చేసిన చిప్స్ తింటే మంచిదే.
మరమరాలు తింటే కూడా ప్రయోజనమే. బియ్యంతో తయారయిన వీటిని తినడం వల్ల మనకు ఇబ్బందులు ఉండవు. ఇందులో కాస్త కారం, ఉప్పు, ఉల్లిపాయలు వంటి వాటిని కలుపుకుని తింటే లాభమే. పెరుగు కూడా రాత్రి పూట తినొచ్చు. ఇందులో వాల్ నట్స్, బాదం, పండ్లు కలుపుకుని తింటే ఇంకా ప్రయోజనమే.
రాత్రి సమయంలో పండ్లు కూడా తినాలి. పండ్లతో మనకు ఎలాంటి కష్టాలు ఉండవు. ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న పండ్లు తినడం ఎంతో మేలు. ఇలా మనం ఏవి పడితే అవి తినకుండా ఒంటికి మంచి లాభాలు కలిగించే ఆహారాలు తీసుకుంటేనే సురక్షితం అంతేకాని బరువు పెరిగే వాటిని తినడం ఏ మాత్రం సురక్షితం కాదనే విషయం అవగాహన చేసుకుంటే సరి.