Ram Charan : తెలుగు రాష్ట్రము రెండుగా విడిపోయి ఇప్పటికే 9 ఏళ్ళు పూర్తి అవుతున్నాయి.. 10వ ఏట అడుగు పెట్టిన తెలంగాణ రాష్ట్రం అంతకు ముందు కంటే అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగింది. తెలంగాణ విడిపోక ముందు మంచి నీళ్లు కూడా సరిగా దొరకని రోజులు ఎన్నో ఉన్నాయి.. అలాంటిది కాళేశ్వరం వంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కలిగి ఉన్న రాష్ట్రంగా ఇప్పుడు ఎదిగింది.
అలాగే ఎంతో మంది పోరాట యోధుల బలిదానాలు, ఎన్నో ఆమరణ నిరాహార దీక్షల మధ్య తెలంగాణ ప్రాంతాన్ని సాధించుకుని ఇప్పుడు ఈ స్థాయి అభివృద్ధి చేసుకున్నారు.. ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంద్రాభంగా టాలీవుడ్ సినీ ప్రముఖులందరూ సోషల్ మీడియా వేదికగా వరుసగా పోస్టులు చేస్తున్నారు..
ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పోస్ట్ చేయగా ఇది కాస్త వైరల్ అయ్యింది.. రామ్ చరణ్ పోస్ట్ చేస్తూ.. ‘తెలంగాణ రాష్ట్రము ఏర్పడి 10 ఏళ్ళు అవుతుంది.. ఈ పదేళ్లలో మనం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాము.. బంగారు తెలంగాణ కోసం అప్పట్లో కన్న కలలు ఇప్పుడు నిజం చేసుకున్నాం.. తెలంగాణ సోదరి సోదరీమణులకు ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం” అంటూ ఈయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది..
అయితే ఈ పోస్ట్ మీద నెటిజెన్స్ డిఫరెంట్ గా కామెంట్స్ చేస్తున్నారు.. నీది తెలంగాణ కాదు కదా అన్ని ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వ్యక్తివి కదా నువ్వు అని కొంత మంది అంటుంటే.. ఆంధ్ర తెలంగాణ అనే తేడాలు చూస్తారేంటి మనమంతా తెలుగు వాళ్ళం అంటూ మరి కొంత మంది అభిమానులు చెప్పుకొస్తున్నారు..