కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 100 మందికి పైగా పద్మ పురస్కారాలను ప్రకటించింది. విద్య , వైద్య రంగాలలో పాటుగా వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులకు పద్మ పురస్కారం లభించగా అందులో తెలుగు రాష్ట్రాల వారు ఉండటం విశేషం. తెలంగాణకు చెందిన రామకృష్ణా రెడ్డికి అలాగే ఏపీకి చెందిన చంద్రశేఖర్ కు పద్మ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణికి పద్మశ్రీ పురస్కారం లభించడం విశేషం.