రాష్ట్రపతి భవన్ లో నిన్న సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను అవార్డు గ్రహీతలకు అందించారు. తెలుగు రాష్ట్రాల నుండి పద్మభూషణ్ అందుకున్నారు చిన్న జీయర్ స్వామి. అలాగే ప్రముఖ సంగీత దర్శకులు యం. యం. కీరవాణి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డుల కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ , హోం శాఖా మంత్రి అమిత్ షా లతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు , అవార్డు గ్రహీతలు అలాగే అవార్డు గ్రహీతల కుటుంబాలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నాయి.
నాటు నాటు అనే పాటకు ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న కీరవాణి చాలా సంతోషంగా ఉన్నారు. తనకు పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల మరింత సంతోషంగా ఉన్నారు. దాంతో తన కుటుంబంతో సహా ఈ వేడుకలో పాల్గొన్నారు. అలాగే ప్రముఖ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి కుటుంబం కూడా ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంది.