30.2 C
India
Monday, May 6, 2024
More

    2024 AP CM : ఏపీ బాస్ ను తేల్చేసిన వేణుస్వామి.. అతడిదే పీఠం!

    Date:

    2024 AP CM
    2024 AP CM, Venu Swamy

    2024 AP CM : 2024 ఎన్నికల్లో ఏపీలో సీఎం అయ్యేది ఎవరనేది ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తేల్చేశారు. ‌ ఏపీలో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో పలు పార్టీలు పొత్తుల చర్చలు కొనసాగిస్తున్నాయి. అయితే ఇవన్నింటికీ భిన్నంగా ఏపీలో భవిష్యత్తు ఉండబోతుందనేది వేణుస్వామి జ్యోతిష్యం. ఏపీలో టీడీపీ, జనసేన పార్టీల పొత్తులో అనూహ్య మార్పులు ఉంటాయని అనే జోష్యం చెప్పారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల పై మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ పార్టీ మూడో స్థానానికి పరిమితమవుతుందని తెలిపారు . మరో 5 నెలల్లో తెలంగాణ, ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పడే ప్రభుత్వాలపై భిన్న వాదనలు కొనసాగుతున్నాయి. ఊరువాడా చర్చలు జరుగుతున్నాయి.‌ అయితే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మాత్రం తన జోష్యం వెల్లడించారు.

    అయితే ఏపీలో తిరిగి జగన్ సీఎం కావడం ఖాయమని తెలిపారు. రెండో స్థానంలో చంద్రబాబు, మూడో స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలిపారు. సీఎం జగన్ కు మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో తుదివరకు తేల్చుకోలేక పోతారని ఏదో ఒక కొత్త మార్పు జరుగుతుందని ట్విస్ట్ ఇచ్చారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనూహ్య పరిణామాలు కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. అయితే తెలుగు రాష్ర్టాల్లో అరెస్టులు ఉండబోతున్నాయని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించినవా.. కేంద్రానికి సంబంధించినవా అనేది మాత్రం చెప్పలేదు.

    అయితే ఏం జరిగినా జగన్ విజయాన్ని ఏ పార్టీ అడ్డుకోలేదని, ప్రజల్లో జగన్ పై ఇంకా అభిమానం తగ్గలేదని వెల్లడించారు. దీంతోపాటు గురుగ్రహం నీచంలో ఉండడంతో జగన్ ను తిట్టే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఓట్లు మాత్రం జగన్ కే వేస్తారని తెలిపారు.  అయితే పవన్, చంద్రబాబు కలిస్తే జగన్ కు టఫ్ ఫైట్ ఇస్తారని, కానీ ఓడించలేరని తెలిపారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో 130 నుంచి 150 సీట్లు వస్తాయని తాను చెప్పిన జోస్యం నిజమైందని తెలిపారు. తెలంగాణలో మాత్రం ఈసారి కూడా హోరాహోరీ ఉంటుందని విశ్లేషణ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈసారి ఢీ అంటే ఢీ అంటాయని, పోటీ అలాగే ఉంటుందన్నారు.

    కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో మార్పు మొదలైందని, కేంద్ర రాజకీయాల్లోనూ అనూహ్య మార్పులు జరుగుతాయని బీజేపీకి సీట్లు తగ్గే అవకాశం ఉందని, హంగ్ కు కూడా ఛాన్స్ ఉందని తెలిపారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం ప్రధాని అయ్యే అవకాశం లేదని చెప్పారు. ఇక తెలంగాణ ఎన్నికల్లో ఎంఐఎం కీలకంగా మారే అవకాశం ఉందని తెలిపారు. గతంలో జేడీఎస్ కుమారస్వామి కర్ణాటకలో పోషించిన పాత్రని తెలంగాణలో ఎంఐఎం పోషించనుందని స్పష్టం చేశారు. అయితే కేంద్రంలోనూ మార్పులు తప్పవని వేణు స్వామి జోస్యం చెప్పారు అయితే వేణు స్వామి జోస్యంపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. పార్టీలు గెలుపుపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఇప్పుడు వేణు స్వామి జోస్యం ఏమేరకు కరెక్టవుతుందో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan or Chandrababu : ఏపీలో జగన్.. చంద్రబాబే.. మూడో వ్యక్తికి నోచాన్స్..!

    Jagan or Chandrababu : ఏపీలో మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు...

    Prabhas Movies : ప్రభాస్ సినిమాలు హిట్ కావా?.. వేణు స్వామి జాతకం ఏం చెబుతోంది?

    Prabhas Movies : మనం జాతకాలను నమ్ముతుంటాం. కొందరు మాత్రం వాటిని...

    ఆ దోషం అక్కినేని ఫ్యామిలీని పట్టుకుంది.. అందుకే.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..

    మనంలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన అక్కినేని వారసుడు అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో...