ఏపీలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతుండడంతో అధికార పార్టీ వైసిపి అభ్యర్థుల ఎంపికపై ఇప్పటినుంచే కసరత్తు మెదలు పెట్టింది. వైసిపిలో ఉన్నకొంత మంది సీనియర్లు అసంతృప్తితో రాజీనామ చేయగా వారి స్థానాల్లో వేరే వాళ్లను ఇన్ చార్జ్ లుగా నియమించింది. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలను నియమించారు. కొంత మంది ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పిస్తూ త్వరలో నే మరో జాబితాలు ప్రకటించినట్లు తెలుస్తోంది. 15 మంది సిట్టింగ్ ఎంపీలను అసెంబ్లీ బరిలోకి 20 మందికి పైగా ఎమ్మెల్యేలను పార్లమెంట్ స్థానాలకు పోటీ లో నిలపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. 30 మందికి పైగా కొత్తవారికి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Breaking News