రంగారెడ్డి: నార్సింగిలో ఓ దొంగ రెచ్చిపోయారు. సన్ సిటీ వద్ద హెచ్డీఎఫ్సీ ఏటీఎంలోకి చొరబడి డబ్బు దొంగిలించేందుకు విఫల యత్నం చేశాడు. ఏటీఎం మెషీన్ను తెరిచేందుకు శత విధాలుగా యత్నాలు సా గించాడు. తన వెంట తెచ్చుకున్న రాడ్తో ఏటీఎం కింది భాగాన్ని తెరవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. గంటపాటు హెచ్డీఎఫ్సీ ఏటీఎంలోనే ఉండి దానిని తెరిచేందుకు నానా తంటాలు పడ్డాడు. ఇంతలోనే సైరన్ మోగింది. ఇక అంతే.. అక్కడి నుంచి పరుగు అందుకున్నాడు. ఇక ఏటీఎంలో దొంగ పడిన తంటా లన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సైరన్ మోగడంతో నార్సింగి పోలీసులు హుటాహుటిన ఘట నా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.