మూవీ ప్రమోషన్ లతో పాటు సెలబ్రిటీలను తనకు నచ్చిన విధంగా క్వశ్చన్స్ అడిగి నెట్టింట ట్రోలింగ్ అవుతూ ఉండే ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్టు సురేష్ కొండేటి చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. ఇక మీదట ఆయన మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ కనిపించడం కష్టమని అంటున్నారు. ఎందుకంటే సురేష్ కొండేటిని తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ బ్యాన్ చేశారన్న వార్త ప్రస్తుతం హల్చల్ అవుతుంది.
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, క్రిటిక్ అసోసియేషన్ తో పాటు పీఆర్వోలు అందరూ కలసి కోఆ ర్డినేషన్ కమిటీగా ఏర్పడి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో మూవీ ఓపెనింగ్స్ నుంచి రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ వరకు చాలా వాటి మీద నిర్ణయాలు తీసుకున్నారు.ఈ క్రమంలోనే జర్నలి స్టు సురేష్ కొండేటి మీద కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఇటీవల జరిగిన సంతో షం అవార్డుల ఫంక్షన్ లో జరిగిన కాంట్రవర్సీ నేపథ్యంలో ఆయనకు టీఎఫ్సీసీ ఒక లెటర్ను జారీ చేసిం ది. దీంతో ఇదే కారణంగా కొన్నాళ్ల పాటు సురేష్ ప్రెస్ మీట్లకు దూరంగా ఉంచాలని టీఎఫ్ సిసి నిర్ణయిం చిందని తెలుస్తోంది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున జరిగే ప్రెస్ మీట్స్లో సురేష్ కొండేటి కొంతకాలం పాటు కనిపించే అవకాశం లేదని తెలుస్తుంది.
చాలారోజుల తర్వాత సంతోషం అవార్డుల కార్యక్రమాన్ని సురేష్ కొండేటి గోవాలో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కోసం సౌతిండియా నుంచి చాలా మంది సినీ ప్రముఖులను, మీడియా ప్రతినిధులను గోవాకు తీసుకెళ్లారు. అయితే ఈవెంట్ నిర్వహణలో పలువురు కన్నడ సెలబ్రిటీలకు చేదు అనుభవం ఎదురైం దంటూ వార్తలు వచ్చాయి. కన్నడ ప్రముఖుల్ని స్టేజీ మీద అవమానించారని, హోటల్ సిబ్బంది తోనూ వారికి ఇబ్బంది ఏర్ప డిందని, రూమ్ బిల్స్ కూడా చెల్లించలేదనే విమర్శలు వినిపించాయి. ఈ విషయంలో తెలుగు పరిశ్రమను కన్నడ జర్నలి స్టులు తప్పుబట్టారు. అయితే దీని మీద మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సీరియస్ అయ్యారు. ఒక వ్యక్తి చేసిన దానికి మొత్తం టాలీవుడ్ ఆపాదించడం సరికాదన్నారు. ఇక ఈ కాంట్రవర్సీ వల్ల విమర్శల పాలైన సురేష్ కొండేటి.. ఇప్పుడు బ్యాన్ కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని ఫిల్మ్ నగర్ టాక్. అయితే తనను బ్యాన్ చేశారంటూ వస్తున్న వార్తలపై సురేష్ కొండేటి సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. తాను ఓ డివోషనల్ ట్రిప్లో ఉన్నానని. మళ్లీ హ్యాపీగా ప్రెస్ మీట్ వస్తానని క్లారిటీ ఇచ్చారు.