ప్రశాంత్ వర్మ తేజా కాంబినేషన్లో తెరకెక్కిన హనుమాన్ సినిమా మరో రికార్డు నెలకొల్పింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షో లో ఏకంగా 2 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడైన చిత్రంగా చరిత్రలో నిలిచింది. ఈ ఏడాది లో విడుదలైన చిత్రాల్లో ఇదే రికార్డు అని చెప్పవచ్చు. కాగా ఈ మూవీ ఇప్పటికే రూ.100 కోట్ల పైగా కలెక్షన్లను రాబట్టింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇటీవల అగ్రహీరోల సినిమాలు విడుదల అయినా హనుమాన్ అంత బుకింగ్ లు రాలేదనే చెప్పవచ్చు. 2 మిలియన్లకు పైగా బుక్సింగ్ జరిగాయి అంటే హనుమాన్ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మెత్తం మీద హనుమాన్ సినిమా 2 మిలియన్ల సంఖ్యను కూడా దాటే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.