డీఎస్సీపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సజ్జల రామకృష్ణ ఫైర్ అయ్యారు. గత టీడీపీ అబద్ధాలను ఎండగడుతూ, సమధానం ఇచ్చారు. చంద్రబాబు తన కెరీర్లో 5000 డీఎస్సీ పోస్టులు ఇచ్చాడని జగన్ ప్రభుత్వంలో 12,000 డీఎస్సీ,1.3 లక్షల సచివాలయం ఉద్యోగాలు కల్పించాడని సజ్జల అన్నారు. ఇది ఉద్యోగాల కల్పన కాదా! ఉపాధి కాదా! అని ఆయన ప్రశ్రించారు. చంద్రబాబు వయసు మీద పడి, నిద్ర పోతే, వయసులో ఉన్న లోకేశ్ కూడా నిద్రపోతున్నాడా అని సజ్జల ప్రశ్నించారు. గతంలో నోటిఫికేష్ లు లేక నిరుద్యోగులు ఇబ్బందులకు గురిఅయ్యరని ఆయన మండిపడ్డారు..వైసిపి అధికారంలోకి వచ్చాక ఎ న్నో నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు…దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా సచివాలయాలను ఏర్పాటు చేయడమే కాకుండా వేలాధిమందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసిపి ప్రభుత్వానిది అని సజ్జల అన్నారు.