Jailer Entered the Field : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ‘స్కిల్ డెవలప్ మెంట్’ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. సీబీఐ కోర్టు రిమాండ్ విధించగా.. అత్యున్నత న్యాయ స్థానం (హై కోర్టు) కూడా రిమాండ్ ను కంటిన్యూ చేయాలని ఆదేశించింది. దీంతో పాటు ఈ నెల 19వ తేదీ (మంగళవారం) వరకు ఈ కేసులో ఎటువంటి వాదనలు జరిగేందుకు వీలు లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ప్రముఖుల నుంచి పరామర్శలు మొదలయ్యాయి.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ రేపు రాజమండ్రి కేంద్ర కారాగారానికి వెళ్లి చంద్రబాబు నాయుడిని పరార్శించనున్నారు. ఈ మేరకే ఆ పార్టీ కార్యాలయం ములాఖత్ గురించి అధికారులకు కూడా దరఖాస్తు కూడా చేసింది. అనుమతులు వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ రాజమండ్రి వెళ్లి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడిని పరామర్శిస్తున్నారు.
ఇక, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబు నాయుడు అరెస్ట్, జైలు, తదితర వివరాలను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఫోన్ చేసి తెలుసుకున్నారు. ‘తనకు చంద్రబాబు ఆత్మీయ మిత్రుడని ఆయనకు ఏమీ కాదు’ అంటూ లోకేశ్ కు ధైర్యం చెప్పారు. ‘చంద్రబాబు తప్పు చేయరు. ఆయన చేసిన డెవలప్ మెంట్, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల అండే ఆయనను రక్షిస్తుంది. ఇలాంటి తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్ లు ఆయనను ఏమీ చేయలేవు. ఆయన చేసిన మంచే ఆయనను రక్షిస్తుంది. మీరు అధైర్య పడవద్దు.’ అంటూ లోకేశ్ కు ధైర్యం చెప్పారు.
చంద్రబాబు అరెస్ట్ ను ప్రముఖ నిర్మాత వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ కూడా ఖండించారు. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. ‘ఆయనను ఇంత దుర్మార్గంగా అరెస్ట్ చేసిన వారికి పుట్టగతులు ఉండవు. దీనికి ఏపీ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఇంకా 4 నెలల్లో జరిగే ఎన్నికల వారు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. 170 సీట్లలో 160 చంద్రబాబే గెలుస్తారు’ అంటూ పేర్కొన్నారు.