Karimnagar People : కరీంనగర్ ప్రజలకు ఓ ప్రముఖ దర్శకుడు క్షమాపణలు చెప్పారు. ఆయనెవరో కాదు.. ప్రస్తుతందేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ది కేరళ స్టోరీ చిత్రం దర్శకుడు. ఎన్నో వివాదాలు, తిరస్కరణలు, మద్దతు, నిషేధాలు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రస్తుతం ఈ సినిమా నడుస్తున్నది. అయితే ఆయన ఆదివారం తెలంగాణలోని కరీంగనర్ ప్రజలకు సారీ చెబుతూ ఒక ట్వీట్ చేశారు.
కరీంనగర్ కే ఎందుకంటే..
కరీంనగర్ (Karimnagar ) అంటేనే పవర్ ఫుల్. సంచలనాలకు కేంద్ర బిందువు. ఉద్యమమైనా రాజకీయమైనా కరీంనగర్ కు చైతన్యమెక్కువ. అయితే దోస్తీ లేదంటే కుస్తీ. అయితే కరీంనగర్ లో ఆదివారం బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఏక్తా యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ది కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్తో సేన్ రావాల్సి ఉంది. కానీ ఆయన హాజరవలేదు. ఆరోగ్య సమస్యల కారణంగా తాను ఇంత మంచి కార్యక్రమానికి రాలేకపోయానని, కరీంనగర్ ప్రజలకు ఈ మేరకు క్షమాపణలు చెబుతున్నటు్ల ట్వీట్ చేశారు.
ఈ సినిమా గురించి మీతో చర్చించాలనుకున్నాను.. మన బిడ్డల జీవితాలతో ముడి పడి ఉన్న ఈ సినిమాను మీరు ఆదరించాలని కోరారు. అయితే అస్వస్థతకు గురికావడం కారణంగా కరీంనగర్ రాలేకపోతున్నానని చెప్పారు. దర్శకుడు సుదీప్తో సేన్ హీరోయిన్ ఆదాశర్మ కు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన కొంత అనారోగ్యంగా ఉండడంతో రాలేదని భావిస్తున్నారు. బాలీవుడ్ స్థాయి దర్శకుడు కరీంనగర్ ప్రజలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా కరీంనగర్ మాత్రం మరోసారి కీలక వార్తల్లోకెక్కింది.