భారత్ నేవీ మరోసారి దేశాన్ని గర్వంగా తలెత్తుకునేలా చేసింది. శత్రువైనా, మిత్రుడైనా ఆపదలో ఉన్న ప్పుడు రక్షించాలనే ధర్మాన్నితూచా తప్పకుండా పాటిస్తోంది. సోమాలియా సముద్రపు దొంగల చేతికి చిక్కుకున్న 19 మంది దాయాదీ దేశస్థులను చెర నుంచి విడిపించింది. సోమాలియా తూర్పు తీరంలో ఇరాన్ జెండాతో వెలుతున్న ఓ వర్తక నౌకను అడ్డగించిన సముద్రపు దొంగలు అందులోని 19 మందిని బందీలుగా పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఇండియన్ నేవీ యుద్ధ నౌక INS సుమిత్ర వారిని రక్షించింది. భారత నావికాదళానికి ఒకే రోజులో ఇది రెండో రెస్క్యూ ఆపరేషన్ కావడం విశేషం. భారత్ నేవీ చేసిన ఈ సాహసాన్ని ప్రతి ఓక్కరు అభినందిస్తున్నారు. శత్రు దేశం అయినా వారి ప్రాణాలను కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారని భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..ఇండియన్స్ లోనే ఈ గోప్ప లక్షణం ఉంటుందని పలువురు మేదావులు అభిప్రాయపడతున్నారు.