Trapped leopard : రక్తం రుచి మరగనంత వరకు పులి కూడా సాధు జంతువే. ఒకసారి అది రక్తం రుచి మరిగితే ఇక దాన్ని ఆపే వారే ఉండరు. తాజాగా ఇటీవల తిరుమల అలిపిరిలో కాలినడకన వెళ్తున్న పిల్లాడిని చిరుత నోటితో కొరకడం సంచలనం కలిగించింది. దీంతో భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసి మెడ కొరికింది.
దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి కాపాడారు. నిన్న సాయంత్రం ఆ చిరుతను పట్టుకున్నారు. సాయంత్రం రెండు బోన్లు ఏర్పాటు చేసి దాన్ని బంధించారు. ఈ చిరుత చాలా మంచిదని వారంటున్నారు. ఇంతవరకు అది మనుషులపై దాడి చేయలేదని చెబుతున్నారు. బాలుడిని పిల్లిలా అనుకుని దాడి చేసినట్లు భావిస్తున్నారు. వేటాడటం దానికి తెలియదు.
చిరుతపులి వయసు ఒకటిన్నర సంవత్సరాలే. పిల్లికి బదులు పిల్లాన్ని పట్టుకుందని అధికారులు చెబుతున్నారు. చిరుతపులి ఈ మధ్యే తల్లి నుంచి వేరుపడింది. రెండు రోజులుగా ఆహారం లేకపోవడంతో అలమటించి పిల్లాడిపై దాడి చేసింది. పట్టుకున్న చిరుతను త్వరలో అడవిలో వదిలేస్తామని తెలిపారు. చిరుత ఆరోగ్యంగా ఉందని చెబుతున్నారు.
తిరుమలకు వెళ్లే దారిలో ఇదివరకు గతంలో కూడా చిరుతలు కనిపించాయి. ఇలా దాడి చేయడంపై భక్తులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాలినడకన వెళ్లే భక్తులకు అడవి జంతువుల నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో ఏం చేయాలో తెలియడం లేదు. దీని వల్ల జంతువుల దాడి చేయకుండా అధికారులు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది.