తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం నుంచి యువగలo పాదయాత్రను పున ప్రారంభించనున్నారు. రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం నుంచి యువగలం పాదయాత్రను ప్రారంభించనున్నారు.79 రోజులుగా విరామం తర్వాత నేటి ఉదయం 10 :19 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాదయాత్రగా బయలుదేరనున్నారు సెప్టెంబర్ 8న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర రాజోలు మీదుగా పొదలాడ చేరుకుంది ఆ మరుసటి రోజు తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు కావడంతో లోకేష్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు ఇటీవల చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో యాత్రను లోకేష్ మళ్లీ ప్రారంభించారు.
Breaking News