‘స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్’ అని ఆర్టీఏ అధికారులు తరుచూ చుప్తూనే ఉంటారు. కొన్ని లైకులు, సోషల్ మీడియాలో హీరో అయ్యేందుకు ఉత్సాహం చూపి అనంతలోకాల్లో కలిసిపోతారు. అయితే ప్రొఫెషనల్ బైకర్ అయితే అతనికి అన్ని జాగ్రత్తలు తెలుస్తాయి. ఒక్కో సారి ఎంత పెద్ద ప్రొఫెషనల్ అయినా విధి రాతకు తలవంచక తప్పదుమరి.
సాధారణంగా రోడ్డుపై 60 నుంచి 70 కిలో మీటర్ల స్పీడ్ వెళ్తేనే స్కిడ్ అయి కిందపడిపోతామని భయంతో వణికి పోతాం. కానీ ప్రొఫెషనల్ బైక్ రైడర్స్ అలా కాదు. ఎంత స్పీడ్ బైకును అయినా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. అదే విధంగా వారు ఎప్పుడూ హెల్మెట్ ఇంకా కిందపడితే గాయాలవకుండా దుస్తులు ధరిస్తుంటారు. కానీ ఇక్కడ అంతపెద్ద ప్రొఫెషనల్ బైకర్ కూడా కిందపడి గాయాలపాలై ప్రాణాలు వదిలాడు.
ఆగ్రాకు చెందిన బైకర్ అగస్త్య చౌహాన్. ఇతను ప్రొఫెషనల్ బైక్ రైడర్. యూట్యూబ్ లో తన రైడ్ కు సంబంధించి ఎప్పుడూ వీడియోలను అప్ లోడ్ చేస్తుంటాడు. ఆయనకు ఫాలోవర్స్ కూడా ఎక్కువే. అయితే ఢిల్లీలో ఒక బైక్ రేసింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు అగస్త చౌహాన్ బైక్ పై ఆగ్రా నుంచి బయల్దేరాడు. తన జడ్ఎక్స్ 10ఆర్ పై దాదాపు 300 కిలో మీటర్/హవర్ స్పీడ్ తో వస్తున్నాడు. ఈ రైడ్ ను తన కెమెరాలో బంధించాడు. అయితే యమునా ఎక్స్ ప్రెస్ వేపై యూపీలో టప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే ఆయన ఘోర ప్రమాదానికి గురయ్యాడు. ఈ రైడ్ లో తను బైక్ ను అంత వేగంగా అదుపు చేయకపోవడంతో డివైడర్ కు ఢీ కొంది. అతను ధరించిన హెల్మెట్ పగిలిపోగా.. ఘటనా స్థలంలోనే అగస్త్య చౌహాన్ మరణించాడు.