Hyderabad Police : సైబర్ నేరాలకు సంబంధించిన రెండు కీలకమైన కేసులను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. డఫాబెట్ వెబ్సైట్ ద్వారా మోసాలకు పాల్పడు తున్న వ్యక్తిని దిల్లీలో అరెస్టు చేసినట్లు హైదరా బాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిందితుడు హరియాణాకు చెందిన హితేశ్ గోయల్గా పోలీసులు గుర్తించారు. అతడి నుంచి రూ.1.40 కోట్ల నగదును స్వాధీనం చేసుకు న్నారు.యూనిటీ స్టాక్స్ పేరుతో మోసాలు చేస్తున్న వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు.
హైదరాబాదు కు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. రూ. 3.16 కోట్లు నష్టపో యినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింద న్నారు. నిందితుడిని రోనక్అన్నాగా గుర్తించినట్లు చెప్పారు.ఇతడు దుబాయ్ నుంచి మోసాలకు పాల్పడేవాడని, నిందితుడి బ్యాంక్ ఖాతాలోని రూ.20 లక్షలు ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు.అతడికి సహకరించిన మరో ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశామన్నారు.నిందితుడు 95 బ్యాంక్ ఖాతాలు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.