Bigg Boss 7 Telugu : బుల్లితెర ప్రేక్షకులను ఆహ్లాదపరుస్తున్న షో బిగ్ బాస్. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ప్రసారమయ్యేది ఏడో సీజన్. దీంతో షోపై ప్రేక్షకులకు ఉత్కంఠ నెలకొంది. గతంలో సీజన్లకు రేటింగ్ రాకపోవడంతో ఈసారి ఎలాగైనా మంచి రెస్పాన్స్ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్లను మంచి స్థాయిలో ఉన్న వారిని తీసుకుంటోంది.
ఈ నేపథ్యంలో అనుకున్న దాని కంటే తక్కువ మంది కంటెస్టెంట్లే వచ్చారు. ఇంకా రావాల్సిన వారు ఎవరో తెలియడం లేదు. వారు ఎప్పుడు వస్తారు? మిగిలిన వాళ్లెవరు? అనేదానిపై అందరిలో ఉత్కంఠ ఏర్పడింది. సెప్టెంబర్ 3 నుంచి ఏడో సీజన్ ప్రారంభమైంది. ఇందులో కంటెస్టెంట్లు ఆటపాటలతో అలరిస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు కలర్ మరింత పెరిగింది.
ఆరో సీజన్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఏడో సీజన్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు కంకణం కట్టుకుంది. ఉల్టా పల్టా అనే కోణంలో కొత్తగా నడిపించేందుకు ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఏడో సీజన్ విజయవంతంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరుగుతున్నాయి. కంటెస్టెంట్లకు ట్విస్ట్ లు, సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశారు.
ఏడో సీజన్ లో సీరియల్ నటి ప్రియాంక జైన్, హీరో శివాజీ, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, యంగ్ హీరోయిన్ శుభవ్రీ, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, నటి శోభా శెట్టి, యూట్యూబ్ టేస్టీ తేజ, నటి రతికా రోజ్, నటుడు గౌతమ్ క్రిష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ అమరదీప్ కంటెస్టెంట్లుగా వచ్చారు. నవీన్ పోలిశెట్టి కూడా కంటెస్టెంట్ గా వచ్చాడు.
బిగ్ బాస్ షోకు దాదాపు 20 మంది వరకు కంటెస్టెంట్లు వస్తారని అనుకున్నా 14 మంది మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. ఇక మిగతా వారెవరో తెలియడం లేదు. తమ అభిమాన తారలు లేరని కొందరు నిరుత్సాహపడుతున్నారు. ఏడో సీజన్ లో అందరు సెలబ్రిటీలే వస్తారని అనుకున్నారు. కానీ ఇతరులే ఎక్కువగా రావడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు.
సీనియర్ హీరో అంబటి అర్జున్, యాంకర్ నిఖిలు, భోలే షావలి, హీరోయిన్ ఫర్జానా, సింగర్ మోహన భోగరాజు, సీరియల్ నటి ఐశ్వర్య ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇరవై మంది హాజరవుతారని చెబుతున్నారు. కానీ వారు ఎప్పుడు వస్తారో తెలియడం లేదు. అందరు వస్తేనే బిగ్ బాస్ నిండుగా కనిపిస్తుంది. ప్రేక్షకులకు ఎంజాయ్ కలుగుతుంది.