Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధా కిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రాధా కిషన్ రావు ఈ కేసులో A4 గా ఉన్నా రు. ఎనిమిది సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డ బ్బులు తరలించినట్లు అధికారులు గుర్తించారు. 2018 ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు తరలింపు చేసినట్లు ఆధారాలున్నాయన్నారు.
బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం స్పెషల్ పోలీస్ టీం కృషి చేసినట్లు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ టీం కు మాజీ ఐఏఎస్ అధికారి వాహనాలు సమకూర్చినట్లు తెలిసింది. తమ కులానికి చెందిన వారితో స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలింది. టాస్క్ ఫోర్స్ లోని సిబ్బందిని బెదిరించి మాజీ ఓఎస్డి డబ్బులు సరఫరా చేయించినట్లు తేలింది.
ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతడి కోసం రాధా కిషన్ రావు డబ్బులు తరలించినట్లు బయటపడిందన్నారు. 2003 లో టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన ఇన్స్పెక్టర్లు, సిబ్బం ది డబ్బులు పట్టుకోవడంలో కీలక పాత్ర పోషిం చాలని పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం ఎనిమిది సార్లు డబ్బు పట్టుకున్నారని ఆ మొత్తం కూడా ప్రతిపక్షాలకు చెందినవేనని పోలీసులు తేల్చారు.