Adipurush collection : బాలీవుడ్ డైరెక్టర్ ఓ రౌత్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన ‘ఆదిపురుష్’ సినిమా కలెక్షన్లు ఇప్పటికీ అంతుపట్టడం లేదు. నెగెటివ్ టాక్ వచ్చినా వసూళ్లలో మాత్ర దూసుకెళ్తూనే ఉంది. మార్కెటర్స్ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. దర్శకుడు ఓం రౌత్ సినిమా మేకింగ్ లో సరైన జాగ్రత్తలు తీసుకోలేదని స్పష్టం అవుతుంది. అందుకే ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ టాక్ ను పాజిటివ్ చేసేందుకు స్వయంగా దర్శకుడు ఇది రామాయణ గాధ కాదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు.
మరి రామాయణ గాధ కాకుండా రాఘవుడు, జానకి, భజరంగ్, సుగ్రీవ్, రావణ్ పేర్లు ఎందుకంటూ ప్రేక్షకులు కూడా ఫైర్ అయ్యారు. ఫుల్ నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా.. సినిమా మాత్రం భారీగానే వసూళ్లు రాబడుతుంది. మొదటి రోజు (శుక్రవారం జూన్ 16) ఓపినింగ్స్ బాగానే పడ్డాయి. ఇందులో అంత గొప్పేం లేదనుకోండి. పాన్ ఇండియా మూవీ. బాలీవుడ్ డైరెక్టర్ పాన్ ఇండియా హీరో భారీ వసూళ్లు కామనే అనుకున్నారు అంతా.. కానీ రెండో రోజు (శనివారం జూన్ 17)న కూడా వసూళ్లు తగ్గకపోగా పెరుగాయి. ఎలాగంటే ఒక స్టార్ హీరో మూవీ రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే ఏ మేరకు వసూళ్లు రాబడుతుందో ఆ మేరకు రాబట్టింది ఆదిపురుష్.
శనివారం ఈ సినిమాకు అన్ని ప్రాంతీయ భాషలతో కలిపి రూ. 80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది రాజమౌళి ఆల్ టైమ్ రికార్డు. అయితే, నెగెటివ్ టాక్ సంపాదించుకున్నా ఈ మేర వసూళ్లు సాధారణమైన విషయమేమీ కాదు. దీనిపై నెటిజన్లు కూడా భిన్నంగా మాట్లాడుతున్నారు. కేవలం రాముడిపై భక్తితోనే సినిమా చూస్తున్న వాళ్లు లేకపోలేదంటున్నారు. అసలు రామాయణ ఇతిహాసంలోని కొన్ని ఘట్టాలను ఓం రౌత్ ఎలా తెరకెక్కించారని చూసే వాళ్లు కూడా థియేటర్ కు వస్తున్నట్లు తెలిసింది. రెండో రోజు నూన్ షోలో కాస్త కలెక్షన్లు తగ్గినా, మ్యాట్నీ షో నుంచి భారీగా పెరిగాయి. సోమవారం నుంచి చిల్లర వసూళ్లు మాత్రమే వస్తాయని అంచనా వేసిన మూవీ మార్కెటర్స్. వసూళ్లను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఒక్క నైజాం నుంచే ఈ సినిమా రెండో రోజు రూ. 7.70 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సీడెడ్ ప్రాంతంలో రూ. కోటి 75 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2కోట్ల 10 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ. 94 లక్షలు, నెల్లూరులో రూ. 40 లక్షలు రాబట్టింది. ఇది ఊహించని వసూళ్లే అని చెప్పచ్చు. బ్రేక్ ఈవెన్కి సాధ్యం కాదు కానీ, 80 శాతం వరకు ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ బిజినెస్ రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.