Ambati Rayudu : అంబటి రాయుడుకి జ్ఞానోదయం అయ్యింది. ఉన్న వారికే టికెట్లు ఇవ్వని జగన్ తనకు ఏం ఇస్తాడని అనుకున్నాడో లేదా..? టికెట్ ఇవ్వనని చెప్పాడో కానీ సడెన్ గా అంబటి రాయుడు తన ఆలోచన మార్చుకున్నారు. చేరిన కొద్దిరోజులకే వైసీపీకి గుడ్ బై చెప్పారు. బహుశా వైసీపీ గెలవదని ముందే సర్దుకున్నాడా.? అన్న చర్చ కూడా సాగుతోంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించకపోవడంతో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తాజాగా క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీని వీడుతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇటీవలే అంబటి రాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీలో జాయిన్ అయి పట్టుమని పది రోజులు కాకుండానే అంబటి వైసిపికి గుడ్ బై చెప్పారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు అంబటి రాయుడు తెలిపారు. పార్టీకి గుడ్ బై చెప్పే అంశంపై త్వరలో నే పూర్తి వివరాలను వెల్లడిస్తానని అంబటి రాయు డు తెలిపారు. అంబటి రాయు డు ప్రకటనపై ఇంతలోనే ఏమైంది బ్రో అంటూ, వైసిపి కార్యకర్తలు, ఫ్యాన్స్ ట్విట్ చేస్తున్నారు.
కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా’అని అంబటి రాయుడు ట్విట్ సంచలనం రేపింది.. దీంతో సడన్గా ఏమైంది బ్రో అని వైసిపి కార్యకర్తలు,ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. వైసీపీ పని అయిపోవడంతో తన జీవితాన్ని ఫణంగా పెట్టకుండా తెలివిగా బయటకు వచ్చాడని టిడిపి శ్రేణులు కామెంట్స్..