Anasuya Viral Post :
అనసూయ క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.. ఈమె ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఒకప్పుడు ఈ అమ్మడు యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం.. కానీ ఇప్పుడు పూర్తిగా యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి కేవలం సినిమాల మీదనే ఫోకస్ పెట్టి బిగ్ స్క్రీన్ మీద కూడా తన హవా కొనసాగించాలని అనసూయ తహతహ లాడుతుంది.
అందుకే ఈమె సోషల్ మీడియాలో గ్లామరస్ డ్రెస్సులు వేసి అందాలు తెగ ఆరబోస్తుంది. మరి ఇందుకు తగ్గట్టుగానే ఈమెకు బోల్డ్ రోల్స్ వస్తున్నాయి.. రీసెంట్ గా ఈమె నటించిన విమానం సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో నటించి ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. ఇక అలానే కొన్ని కొన్ని సినిమా అవకాశాలు అయితే అందుకుంటుంది..
ప్రజెంట్ ఈమె చేతిలో ఉన్న పెద్ద ప్రాజెక్ట్ అంటే అది పుష్ప 2 అనే చెప్పాలి. పార్ట్ 1 ను మించి ఈమె క్యారెక్టర్ పార్ట్ 2 లో ఉంటుందట. ఈ అమ్మడు పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ తో ప్రస్తుతం బిజీగా ఉంటూనే అటు సోషల్ మీడియాలో సైతం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ కొత్త కొత్త ఫోటో షూట్ లను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను ఖుషీ చేస్తుంది..
ఇక తాజాగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అక్టోబర్ 4న ఈమె భర్త సుశాంక్ భరద్వాజ్ పుట్టిన రోజు కావడంతో ఈ అమ్మడు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది. కుటుంబ సభ్యుల మధ్య వేడుకలు ఘనంగా జరుగగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అలాగే ఈమె పిక్స్ షేర్ చేస్తూ ఒక పోస్ట్ కూడా చేసింది. ఈ ప్రపంచానికి నీ లాంటి మంచి మనుషులు కావాలి.. నీ లాంటి భర్త, నీ లాంటి కొడుకు, నీ లాంటి తమ్ముడు, నీ లాంటి అల్లుడు కావాలి.. నీ లాంటి తండ్రి కావాలి.. నా విషయంలో నువ్వు అది చాలా హ్యాపీగా ఉందంటూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.