Another Case Against Chandrababu : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై మరో కేసు నమోదైంది. చంద్రబాబు హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించారు. దీంతో ముందస్తు అనుమతులు లేకుండా జనానికి ఇబ్బందులు గురి చేశారనే నెపంతో ఆయన మీద బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబుపై కావాలనే కేసు నమోదు చేశారని తెలుస్తోంది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేసు పెట్టారు. నగర ప్రజలకు అసౌకర్యం కలిగించారనే ఉద్దేశంతో కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీలో లేకపోయినా చంద్రబాబుపై కేసు పెట్టడం ఆశ్చర్యకరం. ఎన్నికల నిబంధనల పేరుతో బాబును టార్గెట్ చేసుకోవడం విడ్డూరంగా ఉంది. అటు ఆంధ్ర ఇటు తెలంగాణలోనూ చంద్రబాబును తిరగనీయకుండా చేస్తున్నారు.
రెండు గంటల పాటు ప్రజలకు ఇబ్బందులు కలిగించారని కేసు పెట్టారు. ర్యాలీ నిర్వహించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు బేగంపేట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. ఇలా బాబు నిరంతరం కేసులతోనే సహవాసం చేయాల్సి వస్తోంది. తెలంగాణలో ఎలాంటి ప్రచారం లేకపోయినా ర్యాలీ నిర్వహించడం నేరం కిందకు ఎలా వస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.