Kunamneni : దర్యాప్తు సంస్థల ద్వారా విపక్షాలను నిర్వీర్యం చేయడానికి బిజెపి ప్రయత్నం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రధానమంత్రి మోడీ ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
బిజెపి బెదిరింపులకు లొంగకపోవడంతోని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేశారని ఆయన ఫైర్ అయ్యారు. ఎన్నికల బాండ్ల ద్వారా బిజెపికి వేల కోట్లు వచ్చాయని దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేయాలని సాంబశివరావు డిమాండ్ చేశారు.
లిక్కర్ స్క్రాప్ కేసులో ఢిల్లీ సీఎంకు సంబంధం లేకపోయినా కుట్రపూరితంగా ప్రధానమంత్రి మోడీ అరెస్టు చేయించారని సాంబశివరావు ఆరోపించారు. బిజెపికి అనుకూలంగా ఉండి లేదా ఆ పార్టీలోకి జాయిన్ అయితే ఏ కేసులు వేధింపులు ఉండమన్నారు. వారికి లొంగకపోతే ఇలా ఈడిని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తారని ఆయన ఆరోపించారు.