WhatsApp Scams : ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విస్తరించింది. ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీంతో అందరు వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కాలం గడుపుతున్నారు. తెల్లవారు లేచింది మొదలు వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. ఎక్కవ సేపు మొబైల్ తోనే సహవాసం చేస్తున్నారు. దీని వల్ల తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని తెలిసినా పట్టించుకోవడం లేదు.
రకరకాల జబ్బులకు కారణంగా నిలుస్తోంది. కంటి చూపు మందగించడం, పలు రోగాలకు మూల కారణంగా స్మార్ట్ ఫోన్లు నిలుస్తున్నాయి. ఈనేపథ్యంలో స్మార్ట్ ఫోన్ల వాడకంతో పలు సమస్యలు వస్తున్నాయి. వాట్సాప్ లో సైబర్ మోసాలు జరుగుతున్నాయి. కేంద్ర హోం శాఖ కు చెందిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సంస్థ ప్రజలకు పలు సూచనలు చేస్తోంది.
వాట్సాప్ ద్వారా ఏడు రకాల మోసాలు జరుగుతున్నట్లు గుర్తించారు. మిస్డ్ కాల్స్, వీడియో కాల్స్, జాబ్ ఆఫర్స్, అన్వెస్ట్ మెంట్ ప్లాన్స్, డూప్లికేటింగ్, హైజాకింగ్, స్ర్కీన్ షేరింగ్ లాంటివి ఉన్నాయని తెలిపింది. ప్రమాదకర లింకులు ఓపెన్ చేయకపోవడమే సురక్షితమని సూచిస్తోంది. వీటిని ఓపెన్ చేస్తే మనకు జరిగేది నష్టమే. దీంతో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.
స్మార్ట్ ఫోన్ వాడేవారు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మన సమాచారం దొంగిలించి మన ఖాతాలో ఉన్న డబ్బు కొట్టేస్తారు. అందుకే అపరిచిత కాల్స్ కు రెస్పాన్స్ కాకపోవడమే ఉత్తమం. ఈనేపథ్యంలో వాట్సాప్ ఉపయోగించే సందర్భంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వివరాలు వెల్లడించడం సురక్షితం కాదు.