KCR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఅర్ఎస్ అధినేత కేసీఆర్ కు వరుస షాక్ లు ఇస్తున్నారు. ముఖ్యనేతలందరూ పార్టీకి గుడ్ బై చెబుతు న్నారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవగా.. ఇప్పుడు మరో బిగ్ షాక్ తగలనుంది.
కెసిఆర్ సొంత జిల్లా మెదక్ జిల్లాలో ని అది కూడా స్నేహితుడి ఆయనకు గుడ్ బాయ్ చెప్పేందుకు సిద్ధమయ్యాడట. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, కెసి ఆర్ సన్నిహితుడు మదన్ రెడ్డి పార్టీని విడాలని నిర్ణయించుకున్నారట.
కొన్నాళ్లుగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మదన్ రెడ్డి.. కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్లిన మదన్ రెడ్డి.. త్వరలోనే ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆయన అనుచరులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ టికెట్ను మదన్ రెడ్డికి బదులుగా శ్రీమతి సునిత లక్ష్మారెడ్డి కి కేటాయించారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతు న్నారు. రేపో మాపో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలామంది ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి కొందరు నేతలు సైతం ఈ వరుసలో ఉన్నారు. పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరగా..
ఇప్పుడు ఎమ్మెల్యేలు సైతం గోడ దూకే ప్రయత్నం చేస్తున్నారు. ఇకంగా 20 మందికి పైగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి తమ చేరబో తున్నారంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్తారనేది ముందు ముందు తెలియనుంది.