BRO : గత కొద్దీ రోజులుగా ‘బ్రో’ వివాదం సాగుతూనే ఉంది.. బ్రో విషయంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు రోల్ పెట్టడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.. ఈ వివాదం బ్రో సినిమా రిలీజ్ అయినప్పటి నుండి సాగుతూనే ఉంది.. రోజురోజుకూ ఎక్కువ అవుతుంది కానీ తగ్గడం లేదు.. మరి ఇది ఇంత వివాదం అయినా కూడా పవన్ ఇప్పటి వరకు స్పందించలేదు..
మరి ఎట్టకేలకు ఈ వ్యవహారంపై పవన్ స్పందించారు.. పవన్ మాట్లాడుతూ.. సినిమాను సినిమాగానే చూడామని దానిని రాజకీయంగా మార్చకండి అంటూ తేల్చి చెప్పారు.. రాజకీయాల్లోకి సినిమాను తీసుకు రాకండి.. ఫ్యాన్స్ మాట్లాడితే అది వేరు.. కానీ పార్టీ నాయకులూ సైతం ఈ వివాదంపై స్పందించడం ఏంటని అంటూ హెచ్చరించారు..
నేను రాజకీయంగా నడవాలంటే సరైన ఇంధనం సినిమా మాత్రమే అని.. సినిమాల ద్వారా వచ్చిన డబ్బునే నేను ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తున్నాని.. నా సినిమాల గురించి వైసిపి నేతలు మాట్లాడతారు.. అది కేవలం సమస్యను డైవర్ట్ చేసేందుకే అని వారు చెప్పిన దానికి సరైన సమాధానం చెప్పాలి కానీ వివాదాల జోలికి పోకండి అని..
మనం పోరాటం చేయాల్సింది జగన్ అనే దుష్టపాలకుడి మీద అని బ్రో ఒక సినిమా మాత్రమే అని మీరెవ్వరూ దాని గురించి మాట్లాడకండి అంటూ ఈయన జనసేన నాయకులకు తెలిపారు. అలాగే ముందస్తు ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని.. సీట్ల కోసం ఎవరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదు.. పవన్ తో మాట్లాడి పదవి ఇప్పిస్తాం అని డబ్బులు తీసుకునే వారిని కూడా నమ్మకండి అంటూ ఈయన నాయకులను ఆదేశించారు..